Sunday, January 26, 2014

అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్

ఈ రోజు వార్తల్లో చూసాను అశోక చక్ర అందుకున్న ఆంధ్ర ఇన్స్పెక్టర్ కె. ప్రసాద్ బాబు గురించి. ప్రసాద్ బాబు గ్రే హౌన్డ్స్ సబ్-ఇన్స్పెక్టర్. మావోయిస్ట్లతో పోరాడుతూ, క్రితం సంవత్సరం ఏప్రిల్ లో, నలుగురు సహచరులని కాపాడి, ఆ ప్రయత్నంలోనే తన ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త , ప్రసాద్ బాబు తండ్రి బాధ, మనసుని కలచి వేసింది. 


 Ashok Chakra for Andhra Pradesh's braveheart cop, who died fighting Maoists

 http://www.ndtv.com/article/india/ashok-chakra-for-andhra-pradesh-s-braveheart-cop-who-died-fighting-maoists-475651
 
   
      ఇంత చదువుకున్న, తెలివైన, ధైర్యం గల యువకుడిని కోల్పోవడం నిజంగా ఆ కుటుంబానికే కాదు,సమాజానికి కూడా పెద్ద లోటే. ఇదే సంఘటనలో మరో 9 మంది నక్సల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు  కూడా చదువు , తెలివి, ప్రాణాలను పణం పెట్టగలిగిన తెగువ కలిగిన , ప్రసాద్ బాబు లాంటి యువకులే అయ్యి ఉండవచ్చు.  కానీ వారికి ఎటువంటి గుర్తింపు ఉండదు, వాళ్ళ పేర్లు మనకు తెలియవు, కనీసం వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఆఖరి చూపు కూడా దక్కి ఉండకపోవచ్చు.

      కేవలం ఆశయాలు, లక్ష్యాలు  వేరైనందుకు, ఇరువైపులా పూడ్చుకోలేని  ప్రాణ నష్టం జరిగిపోయింది. 10 కుటుంబాలు తాము గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కొడుకులను, నవ్వులూ-ఏడుపులు కలిసి పంచుకున్న అన్న/తమ్ముళ్ళని, మనస్సుని, జీవితాన్నిపంచుకున్నసహచరులను కోల్పోయారు. కారణమేదైనా కానీ, ఈ హింస ఎప్పటికీ సమర్థనీయం కాదు. 

      సమాజంలో అసమానతలు, అన్యాయాలు ఉన్నంత కాలం సాయుధ పోరాటాలు, వాటిని అణచి వేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు ఉండి తీరుతాయి అని తెలుసు. అవన్నీ ఉన్నంత కాలం ఇరుపక్షాలు ఇలాంటి సంఘటనలను collateral damage అని సమర్థించుకుంటాయి అనీ తెలుసు. అన్నీ తెలిసినా ఇలాంటి వార్త చూడగానే మనసు కదిలి వచ్చే దుఃఖం ఎందుకు ఆగదు ???

 

No comments:

Post a Comment