Wednesday, April 16, 2014

కొలనులో కలువనై విరిసాననా,ఓ నాన్నా

కొలనులో కలువనై విరిసాననా, ఓ నాన్నా


ఇవాళ్టి పేపర్లో చూసే ఉంటారు... జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా "నా బంగారు తల్లి" అనే చిత్రాన్ని ఎంపిక చేసారు. అసలు ఎప్పుడూ పేరు కూడా వినలేదే అని గూగుల్ చేస్తే యూట్యూబ్ లో శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట కనపడింది. 



 

   ట్రైలర్ చూస్తుంటే కాస్తా "మహానది" సినిమాలోలా కూతురు అనుకోని విషవలయంలో చిక్కుకొని, బలవంతంగా వ్యభిచారంలోకి దింపబడితే, సర్వ శక్తులు ఒడ్డి కాపాడుకునే నాన్న కథ అనిపించింది. కానీ అంత ముఖ్యమైన నాన్న కారెక్టర్ కి మలయాళం యాక్టర్ సిద్దిఖ్ ని ఎందుకు తీసుకున్నారు అనుకున్నా.కింద ఉన్న బ్లాగ్ పోస్ట్ చదివాక అర్థమైంది, ఈ సినిమా మలయాళం, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి నిర్మించారని.  

అదే సినిమానుండి ఇంకో పాట... 





   ఉమెన్ అండ్ గర్ల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆపడానికి "ప్రజ్వల" ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ప్రయత్నానికే తన జీవితాన్ని అంకితం చేసిన సునీత కృష్ణన్ గారు ప్రొడ్యూస్ చేసారు అని చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఇంకాస్తా పెరిగింది. ఈ ఫిలిం మేకింగ్ జర్నీలో ఆవిడ పడ్డ కష్టాల గురించి ఆమె మాటల్లోనే ఇక్కడ చదవండి.  

http://sunithakrishnan.blogspot.com/

No comments:

Post a Comment