Thursday, March 6, 2014

ఇప్పుడు చదువుతున్న పుస్తకం...

"అమృతవర్షాలు కురిసే రాత్రుల కోసం మనం నిరీక్షించకపోవచ్చు. మిన్ను విరిగి మీదపడే వేళల కోసం మెలకువగా ఉండకపోవచ్చు. కానీ ఆదమరచిన సమయాన పలకరించే ఆశ్చర్యాలకు, అదాటున మీదపడి అలజడి రేపే ఆనందాలకు, అనుకోకుండా వచ్చే అపురూపమైన అతిథులకు,మన జీవితాలను, హృదయాలను అన్నివేళలా ఒక సంసిద్ధతలో వుంచుకోవాలి. దెబ్బ కాచుకోడానికి వొళ్ళు రాటుదేల్చి పెట్టాలి. అయాచిత అద్భుతాల కోసం దోసిలి పట్టడం నేర్చుకోవాలి."

నాకిష్టమైన... అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, తనదంటూ పాఠకులు చటుక్కున గుర్తుపట్టే శైలిని ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారి "శీతవేళ రానీయకు" పుస్తకంలోని కొన్ని పంక్తులివి. 






                                                            Image from avkf.org

పుస్తకం avkf.org వెబ్ సైట్లో లభ్యం

పుస్తకం పేరు వినగానే మీకు దేవులపల్లి గారి ఆ పాట గుర్తు వచ్చిందని తెలుసు. మరెందుకాలస్యం...వినేస్తే ఓ పనైపోతుంది కదా.


No comments:

Post a Comment